వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత జవాన్లు ధీటుగా సమాధానం చెబుతున్నా.. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం ఉదయం 5.15గంటలకు సుందర్బని సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పులు తెగబడింది.

పాక్ కాల్పులకు ఇద్దరు భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వినోద్ సింగ్, జాకీ శర్మ అనే మరో ఇద్దరు జవాన్లు కూడా పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.

J&K: Two jawans killed in ceasefire violation by Pakistan Army in Sunderbani sector

వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, భారత దళాలు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసి పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Two jawans have lost their lives on Tuesday in ceasefire violation by Pakistan Army in Sunderbani sector along the Line of Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X