డ్రాగన్ దుందుకుడు చర్య: టిబెట్ వద్ద 70 ఫైటర్ జెట్ల మొహరింపు, హమ్మర్ క్షిపిణి కొనుగులుతో...
తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కొనసాగుతూనే ఉంది. తమ బలగాలను చైనా వెనక్కి తీసుకోకపోవడంతో.. భారత్ కూడా యుద్ధ విమానాలను దింపుతోంది. ఈ క్రమంలో రాఫెల్ యుద్ధ విమానాలకు బూస్ట్ నిచ్చే హమ్మర్ క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. దీంతో చైనా కూడా టిబెట్ హోబత్ ఎయిర్ బేస్ వద్ద 70 ఫైటర్ జెట్ విమానాలను మొహరించింది.
Recommended Video
జే7, జే 11 ఫైటర్ జెట్లను చైనా మోహరించినట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు భారత్, అటు చైనా దుందుకుడు చర్యలతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ లడక్ పర్యటనను కూడా చైనా నిశితంగా పరిశీలించింది. భారత్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్లను కొనుగోలు చేస్తున్న అంశాన్ని కూడా వాచ్ చేస్తోంది. ఈ క్రమంలో తూర్పు లడాఖ్లో తమ బలగాలను కొనసాగిస్తోంది. దీనికి తోడు 70 ఫైటర్ జెట్లను మొహరించి.. తానేం తక్కువ తినలేదు అని సందేశం ఇస్తోంది.
మరోవైపు భారత్కు అమెరికా కూడా మద్దతు ఇస్తుండటం డ్రాగన్కు కంటిగింపుగా మారింది. అందుకోసమే దుందుకుడుగా ప్రవరిస్తోంది. చైనా బలగాలను వెనక్కి తీసుకోకపోవడంతోనే భారత్ మిగ్ విమానాలను రంగంలోకి దింపింది. దాని తర్వాత రాఫెల్ విమానాలను మొహరిస్తోంది.