తల్లిని రేప్ చేశాడు: జైల్లో నీచుడ్ని చంపేసిన ఖైదీలు
రాయ్ పూర్: మానవరూపంలో ఉన్న ఓ కీచకుడు చెయ్యకూడని పని చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న తల్లి మీద అత్యాచారం చేసిన ఆ నీచుడు అనేక నేరాలు చేసిన ఖైదీల చేతిలో దారుణ హత్యకు గురైనాడు.
ఇలాంటి వాడిని చంపినందుకు మాకు ఎలాంటి భాదలేదని ఖైదీలు అంటున్నారు. చత్తిస్ గఢ్ లోని దుర్గ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాబు (32) అనే యువకుడు హత్యకు గురైనాడు. బాబు నిత్యం మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో ఇతను మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లాడు.
కామంతో కళ్లు మూసుకుపోయి జన్మనిచ్చిన తల్లి మీద అత్యాచారం చేశాడు. ఇలాంటి కొడుకు బయట ఉంటే దేశం సిగ్గుతో తలదించుకుంటుందని అనుకున్న ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బుధవారం నిందితుడిన్ని కోర్టులో హాజరుపరిచారు. అతని తరుపున వాదించడానికి ఏఒక్క న్యాయవాది ముందుకురాలేదు. అంతే కాకుండా న్యాయవాదులు అందరూ కలిసి బాబు మీద దాడి చేశారు. నిందితుడిన్ని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నిందితుడిన్ని చత్తిస్ గఢ్ లోని దుర్గ్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో బరాక్ నెంబర్ 14లో అతనిని పెట్టారు. సెంట్రల్ జైల్లో 120 మంది ఖైదీలు ఉన్నారు. అదే రోజు రాత్రి జైలు సిబ్బంది బాబు సొంత తల్లిని రేప్ చేశాడని అక్కడ ఉన్న ఖైదీలకు చెప్పారు.
అంతే అనేక క్రిమినల్ కేసుల్లో ఉన్న ఆ ఖైదీలు సైతం చలించిపోయారు. ఇలాంటి నీచుడు బ్రతికుండరాదని అనుకున్నారు. అందరూ కలిసి అతని మీద దాడి చేసి అక్కడే చంపేశారు. హత్య కేసుల్లో జైల్లో ఉన్న దినేష్ తివారి, సంతోష్ అనే ఇద్దరు బాబును హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర ఖైదీలను పోలీసులు విచారిస్తున్నారని ఐజీ దిపాన్సు కబ్రా తెలిపారు.