త్వరలోనే కూతురు పెళ్లి: సిమి ఉగ్రవాదుల చేతిలో మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలులో సిమి ఉగ్రవాదుల చేతిలో ఆదివారం అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయారు హెడ్కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్. కాగా, ఆయన తన కూతురు పెళ్లి కొద్ది రోజుల్లోనే చేయాల్సి ఉండగా.. ఈ ఘటన జరగడం ఆ కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది.
డిసెంబర్ 9న తన 24 ఏళ్ల కుమార్తె సోనియాకు.. మేనల్లుడు విజయ్ శంకర్తో వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుకల హడావుడిలో ఉన్న కుటుంబ సభ్యులు.. రామశంకర్ హత్యకు గురయ్యాడని తెలీడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
యాదవ్ కుమారులు శంభునాథ్, ప్రభునాథ్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. యాదవ్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి మర్చూరీలో భద్రపరిచారు. బుధవారం రామశంకర్ యాదవ్ స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆదివారం అర్ధరాత్రి జైలు నుంచి పరారైన 8మంది ఉగ్రవాదులను పోలీసులు భోపాల్ శివారులో ఎదురుకాల్పుల్లో మట్టుబ్టిన విషయం తెలిసిందే. కాగా, కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకుంటామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు.