మహిళ స్వచ్ఛంధ మరణం.. 82 ఏళ్ల వయస్సులో వృద్దురాలు దీక్ష
సాధరణంగా మనిషి ఎట్టిపరిస్థితుల్లో మరిన్ని రోజులు బ్రతకాలని కోరుకుంటారు. ఎన్ని ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చిన సహజమరణం పోందే వరకు వేచి చూస్తారు. కాని దేశంలోని ఓ మతంలో మతంలో మాత్రం చావుకు దగ్గరైన వారు స్వఛ్చందగానే తనువు చాలించే సంప్రాదాయం కూడ ఉంది..అలా గుజరాత్లోని ఓ మహిళ సహజ మరణం పొందింది.
ఇరవై కాదు ,ముప్పై కాదు ఏకంగా 82 సంవత్సరాల గుజరాత్ వృద్దురాలు స్వంఛ్చంధ మరణాన్ని పొందింది. అయిదు రోజులపాటు ఉపవాసం చేసి అనంతరం తనువు చాలించింది. అయితే ఇది ఆమే తమ మతానికి చెందిన సాంప్రదాయమైన మరణం పండగ లో భాగంగా చేసింది.
జైన మతానికి చెందిన కాంచన్ దేవి 82ఏళ్ల వృద్దురాలు తన ఆత్మను వదిలేందుకు నిరహార దీక్ష చేపట్టింది. దీక్షలో భాగంగా మంచినీళ్ల తోపాటు ఎలాంటీ అహారాన్నితీసుకోరు. ఇలా ఆమే ఈ నెల 11న దీక్ష చేపట్టింది. నాలుగు రోజుల అనంతరం దైవాదీనం అయింది. కాగా ఈ దీక్ష చావుకు దగ్గర అయిన నేపథ్యంలో జైన మతంలో "సంతార" అనే పేరుతో అమరణ దీక్షను చేస్తారు. ఇలా జైన సాంప్రదాయంలో కొనసాగుతోంది.
కాగా ఇలాంటీ దీక్షలు చూడడం చాల కష్టం అవుతుందని వృద్దురాలి మనవరాలు వివేదిత చెప్పారు. చావుకు దగ్గరైన నేపథ్యంలో ఈ దీక్షలు చేసి పునర్జన్మను పోందేందుకు కొనసాగిస్తారని చెప్పారు. కాగా వారి కుటుంభంలో ఇంతకుముందు ఇలా ఇద్దరు వ్యక్తులు చేసి స్వర్గస్థులైయ్యారని వారు తెలిపారు.కాగా జైనమతాన్ని కాపాడుకోనేందుకు ఇలాంటివి కొనసాగుతుయాని వారు తెలిపారు.