కాశ్మీర్లో కీలక ఉగ్రవాది, జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ హతం
జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్ను ఎన్కౌంటర్లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో జరిగింది.
శ్రీనగర్: జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్ను ఎన్కౌంటర్లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో జరిగింది.
సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్, కీలక ఉగ్రనేత అబు ఖలీద్ను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
#Baramulla terrorist attack: #Visual of Jaish-e-Mohammed Operational Head Khalid killed by security forces in Ladoora, Jammu and Kashmir pic.twitter.com/GKwNp1WSRA
— ANI (@ANI) October 9, 2017
బారాముల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ఉగ్రవాదిని మట్టుబెట్టారు. పాకిస్థాన్కు చెందిన ఖలీద్.. మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది. ఉత్తర కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది.
ఈ ఎన్కౌంటర్కు కొద్ది గంటల ముందే బుద్గాం జిల్లాలోని ద్రాంగ్ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.