తమిళనాడులో రాష్ట్రపతి పాలన ! బీజేపీ ఎంపీ స్వామి
చెన్నై: జల్లికట్టు నిర్వహణ విషయంలో తమిళనాడు ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీజేపీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. తమిళనాడులో ఇలాంటి చేతకాని ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
జయలలిత మేనకోడలు దీపా కొత్త పార్టీ: బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరా !
జల్లికట్టు నిర్వహించరాదని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సుబ్రమణ్యస్వామి గుర్తు చేశారు. అయితే న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి జల్లికట్టు నిర్వహిస్తే కచ్చితంగా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్టర్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు.
డీఎంకే ఎంపీ కనిమెళి మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టు నిర్వహణపై ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాని, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని కోరారు. తమిళ ప్రజలు సంక్రాంతి పండగ రోజు జల్లికట్టును నిర్వహించడం ఆచారం అని ఎంపీ కనిమెళి గుర్తు చేశారు.
శశికళ మీద కోపంతో జయలలిత ఆత్మ ఇలా తిరుగుతుందా ?
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలు గురువారం సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కచెయ్యకుండా జల్లికట్టు నిర్వహించారు. గురువారం పోలీసులు దాడి చేసి నామ్ తమిళర్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ అండదండలతోనే జల్లికట్టు నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.