వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షోపియాన్ ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మిగితా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
English summary
Four militants were killed in an encounter with security forces in Shopian district of Jammu and Kashmir on Friday, police said.
Story first published: Friday, August 28, 2020, 19:52 [IST]