పాకిస్థాన్కు కీలక సమాచారం చేరవేత: సాంబలో వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్: భద్రతా దళాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్న వ్యక్తిని జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని భద్రతా దళాలకు చెందిన పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాకిస్థాన్కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
2018 నుంచి కుల్జీత్ ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్ నుంచి అతడికి భారీగా నగదు అందుతోందని చెప్పారు. కుల్జీత్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సెల్ఫోన్లలో సాంబ జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేగాక, సరిహద్దు వెంబడి పరిస్థితిపై కూడా అతడు పాక్కి సమాచారం చేరవేశాడని తెలిపారు.
Jammu and Kashmir: Police have arrested from Samba district a person, Kuljeet Kumar, for allegedly spying for Pakistan. pic.twitter.com/HPkBVeRqbT
— ANI (@ANI) October 8, 2020
దేశ ద్రోహం కేసులో కుల్జీత్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు సాంబ జిల్లా ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ తెలిపారు. పాకిస్థాన్తో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం చేరవేశాడనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.