వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేత: సాంబలో వ్యక్తి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భద్రతా దళాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వ్యక్తిని జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని భద్రతా దళాలకు చెందిన పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

2018 నుంచి కుల్జీత్ ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్ నుంచి అతడికి భారీగా నగదు అందుతోందని చెప్పారు. కుల్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Jammu and Kashmir: police arrests a person from Samba district for spying for Pakistan

ఈ సెల్‌ఫోన్లలో సాంబ జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేగాక, సరిహద్దు వెంబడి పరిస్థితిపై కూడా అతడు పాక్‌కి సమాచారం చేరవేశాడని తెలిపారు.

దేశ ద్రోహం కేసులో కుల్జీత్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సాంబ జిల్లా ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ తెలిపారు. పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం చేరవేశాడనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Jammu and Kashmir Police have arrested a person named Kuljeet Kumar who belongs to Samba district for allegedly spying for Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X