వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని ఫతేహ్హడల్ ప్రాంతంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఉదయం ఈ ఆపరేషన్ నిర్వహించగా.. పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో మరికొందరు పోలీసులు గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేసి.. విద్యాసంస్థలను మూసివేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
srinagar jammu and kashmir encounter terrorists police శ్రీనగర్ జమ్మూకాశ్మీర్ ఎన్కౌంటర్ ఉగ్రవాదులు పోలీసులు
English summary
Three terrorists were killed and a police personnel was martyred during encounter between security forces and terrorists in Fateh Kadal area of Srinagar on Wednesday.
Story first published: Wednesday, October 17, 2018, 13:39 [IST]