వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత: ఐదుగురు హతం

|
Google Oneindia TeluguNews

Recommended Video

కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి పోషియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు.

దీంతో శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఐదుకు చేరింది. శుక్రవారం రాత్రి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. షోపియాన్‌లోని కిల్లోరా ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు ముష్కరులు మృతి చెందినట్లు సైనికాధికారులు వెల్లడించారు.

Jammu and Kashmir: 5 terrorists gunned down in Shopians Killora village

ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఆప్రాంతంలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. అయితే ముష్కరులు కాల్పులకు దిగడంతో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

శుక్రవారం రాత్రి మట్టుబెట్టిన ఉగ్రవాదిని లష్కరే తోయిబాకు చెందిన ఉమర్‌మాలిక్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలను రాష్ట్ర డీజీపీ అభినందించారు.

ఇది ఇలా ఉంటే, ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలిసిన వేర్పాటువాదులు భద్రతా దళాలపై రాళ్లు విసురుతూ ఆందోళనలు చేపట్టారు. భద్రతా దళాల వాహనాలపై అల్లరి మూకలు పెట్రో బాంబులు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

English summary
Five terrorists have been killed in fresh firing in Shopian's Kiloora village on Saturday. The operation concluded with the recovery of all five bodies of terrorists killed in the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X