జమ్మూ కాశ్మీర్ లో నో ఇంటర్నెట్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా రద్దు చెయ్యాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ సందర్బంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కాశ్మీర్ డీజీపీ ఎస్.జే.ఎం. గిలానీ ఆదేశించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి.
ఈ సందర్బంలో జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చెయ్యడం, సోషల్ నెల్ వర్కింగ్ వెబ్ సైట్లు ఓపెన్ చెయ్యడం సాధ్యం కాదు. అదే విదంగా పుకార్లు పుట్టించడానికి ఎలాంటి అవకాశం ఉండదు.
బక్రీద్ పండుగ, రాష్ట్రంలో గో మాంసం పై నిషేధం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. అంతే కాకుండ రెండు రోజుల పాటు ముస్లీం సోదరులు సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటున్నది.