వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము ప్రశాంతం, మత పెద్దలతో చర్చలు సఫలం

|
Google Oneindia TeluguNews

జమ్ము: నేతల పోస్టర్లు తొలగించడం, సిక్కు యువకుడి పై పోలీసులు కాల్పులు జరపడంతో నాలుగు రోజుల నుండి జమ్ము అట్టుడికి పోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి, సిక్కు మతస్తులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులు హడలిపోయారు.

శనివారం ఉదయం సిక్కు మత పెద్దలతో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు చర్చలు జరిపారు, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలు సఫలం కావడంతో జమ్ము, పూంచ్, రాజౌరీ, కథువా, సాంబా జిల్లాలలో సిక్కు మతస్తులు ఆందోళన విరమించారు.

ఆందోళనలకు కారణం అయిన ఖలిస్తాన్ నేత బింద్రన్ వాలే పోస్టర్లు తొలగించిన వ్యక్తులను అరెస్టు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ఆర్ కే గోయల్, కాశ్మీర్ డీజీపీ కే రాజేంద్ర కుమార్ స్వయంగా హామి ఇచ్చారు. అదే విదంగా సిక్కు యువకుడి మీద కాల్పులు జరిపిన పోలీసుల మీద చర్యలు తీసుకుంటామని అన్నారు.

 Jammu and Kashmir government has agreed to all demands of the Sikh community

చర్చల సందర్బంగా పోలీసు అధికారులు హామీలు ఇచ్చారని అందువలన ఆందోళన విరమిస్తున్నామని సిక్కుల నాయకుడు తర్ లోచన్ సింగ్ మీడియాకు చెప్పారు. తమ డిమాండ్ లు తీర్చకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

పోలీసుల దగ్గర నుండి సిక్కులు లాక్కోన్న ఏకే-47 ఆయుధాన్ని పోలీసు అధికారులు స్వాదీనం చేసుకున్నారు. అయితే ముందు జాగ్రత చర్యగా జమ్ము లోని అన్ని జిల్లాలలో శనివారం కూడ అన్ని విద్యాసంస్థలను మూసి వెయ్యాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Sikhs have been protesting for the last three days over the removal of posters of Sikh separatist leader Jarnail Bhindrawale, ahead of his death anniversary today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X