వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్

|
Google Oneindia TeluguNews

దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్మీర్ పునర్విజభన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గోన్న ఆయన కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశం యొక్క తలను నరికారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయంతో జమ్ము కశ్మీర్ చరిత్ర, సంస్కృతిలు ధ్వంసం అయి పోయాయని ఆయన ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ ,భారత దేశాన్ని కలిపే వంతెన లాంటిదని ఆయన పేర్కోన్నారు. ఈనేపధ్యంలోనే జమ్ము కశ్మీర్ ను విభజించడం ద్వార దేశం యొక్క తలను నరకడమే కాకుండా రాష్ట్రాన్ని ముక్కలు, ముక్కలు చేశారని ఆయన అన్నారు.దీంతో జమ్ము కశ్మీర్ ఉనికి లేకుండానే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jammu Kashmir ka tukde tukde kar diya Ghulam Nabi Azad

చైనాతో, పాకిస్థాన్‌తో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో సరిహద్దులు కలిగిన రాష్ట్ర ప్రజలతో ఇలాంటి ఆటలు ఆడటం ప్రమాదకరమని, ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దేశద్రోహం లాంటిదేనని ఆజాద్‌ పేర్కొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసి.. రాష్ట్రానికి బలగాలను పంపించి.. మాజీ సీఎంలైన మెహబుబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచి, కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని అన్నారు. ఇక జమ్మూకశ్మీర్‌ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ సర్కారు వమ్ము చేసిందని తప్పుబట్టారు.

English summary
Jammu and Kashmir was the head of India... Jammu Kashmir ka tukde tukde kar diya "Congress's Ghulam Nabi Azad said today in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X