వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jammu Kashmir‌కు మళ్లీ రాష్ట్ర హోదా -స్పష్టం చేసిన మోదీ సర్కార్ -యూటీలో టెర్రరిజం తగ్గిందట

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేత సందర్భంలో అది కోల్పోయిన రాష్ట్ర హోదా తిరిగి దక్కడం ఖాయమైపోయింది. ప్రస్తుతం అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని బీజేపీ నేతలు హామీ లివ్వడమే తప్ప, ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తొలిసారి కేంద్రం అధికారికంగా దీనిపై క్లారిటీ ఇచ్చింది.

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని, అయితే, అక్కడ పరిస్థితులన్నీ సాధారణ స్థాయికి చేరిన వెంటనే ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర రాష్ట్ర హోదా, అక్కడ ఉగ్రవాద సమస్యలపై పార్లమెంటులో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ బుధవారం లిఖితపూర్వక సమాధానాలిచ్చింది.

 Jammu Kashmir statehood will be restored after normalcy, terrorism reduced: Home Ministry

కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి రాష్ట్ర హోదాను కల్పిస్తామన్న కేంద్రం.. తమ పాలనలోనే అక్కడ టెర్రరిజం తగ్గినట్లు చెప్పుకుంది. 2020లో 59 శాతంగా ఉన్న ఉగ్రవాద కలాపాలు 2021కు వచ్చేసిరికి 32 శాతానికి పడిపోయిందని హోం శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్రం అమలు చేస్తున్నదని, కాశ్మీర్ లో అన్ని వర్గాల మద్దతుతో ప్రక్రియ ముందుకు సాగుతున్నదని హోం శాఖ పేర్కొంది. టెర్రరిజం తగ్గిందని కేంద్రం చెబుతున్నా, ఇటీవల డ్రోన్ దాడులు తీవ్రతరం కావడం కలకలం రేపుతున్నది.

భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగభార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

Recommended Video

Jammu : ఆయుధాలుగా Drones, రోబోటిక్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? Anti Drone System || Oneindia Telugu

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గత నెల 24న జమ్మూకాశ్మీర్ లోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేవం జరగడం తెలిసిందే. ఆ రోజే ప్రధాని స్వయంగా రాష్ట్ర హోదా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా, ఇదే డిమాండ్ ను పార్టీలన్నీ కేంద్రం ముందుంచాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత సందర్భంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు హామీ లభించినా, గడిచిన రెండేళ్లుగా కాశ్మీర్ దాదాపు సైనిక నియంత్రణలోనే కొనసాగుతుండటంతో అన్ని వర్గాల ఆశలు అడుగంటాయి. గత నెలలో జరిగిన అఖిలపక్ష భేటీతో మళ్లీ కదలిక మొదలై, ఇవాళ్టి క్లారిటీతో జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు స్పష్టమైపోయింది.

English summary
The Ministry of Home Affairs (MHA) has said full statehood will be reinstated in Jammu and Kashmir at an "appropriate time" after normalcy is restored. that terrorist incidents were reduced in Jammu and Kashmir during 2020 by 59 per cent as compared to 2019 and 32 per cent up to June 2021. In a written response to mps the union govt clarified so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X