జన్ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ. లక్ష కోట్ల డిపాజిట్లు...!
నిరుపేదలు నిర్వహించే జన్ధన్ బ్యాంకు అకౌంట్లలో అక్షరాల లక్ష కోట్ల రుపాయాలు డిపాజిట్లు దాటాయని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక జన్ధన్ ఖాతా వివరాలు వెల్లడించారు. కాగా జూన్ 3 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 36 లక్షల ప్రధాన్ మంత్రి జన్ యోజన బ్యాంక్ ఖాతాల్లో రూ. లక్ష కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది.
ఆగస్టు 28న 2014న ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి బ్యాంక్ ఖాతాలు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా జన్ ధన్ ఖాతాల పథకాన్ని ప్రారంభించారు. కాగా వీటిని జీరో బ్యాలన్స్ బ్యాంకు అకౌంట్స్గా దేశంలోని మొత్తం 36 లక్షల కుటుంభాలు వీటిని తెరిచాయి.కాగా ఈ ఖాతాలను తెరిచిన వారిలో 60 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరవగా మొత్తం ఖాతాల్లో 53 శాతం మహిళలు వీటిని ఓపెన్ చేశారు.
మరోవైపు జన్ధన్ ఖాతాల్లో నిరుపేదలకు ఇచ్చే పలు పథకాల ప్రయోజనాలను జన్ధన్ ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించింది. మరోవైపు ఆరు నెలల పాటు ఈ ఖాతాలను మెయింటెన్ చేసిన వారికి ప్రభుత్వమే 5వేల రుపాయలు ఖాతాల్లో వేస్తానని ప్రకటించింది. దాన్ని ఇటివల 10వేల రుపాయాలకు పెంచింది. అయితే ఖాతాలు ప్రారంభమైన తర్వాత వాటిలో తగ్గుదల కనిపించింది. కాని అనంతరం ఆయా ఖాతాల్లో లక్ష కోట్ల రుపాయాలు డిపాజిట్ కావడం భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టతను తెలియజేస్తుందని ఆర్ధిక నిపుణులు తెలియజేస్తున్నారు.