నేను పార్టీ మారాను : సినినటి ,మాజి ఎంపీ జయప్రద
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలిటికల్ సీన్ మారుతుంటాయి .ఈ నేపథ్యంలోనే అటునుండి ఇటు నుండి అటు జంపింగ్ లు కొనసాగుతున్నాయి.
తాజగా సినినటి ,రాజ్యసభ మాజి ఎంపీ జయప్రద పార్టీ మారారు. ఆమే ఈ రోజు బీజేపి లో చేరారు. గతంతో సమాజ్ వాది పార్టీలో ఉన్న ఆమే..తర్వాత బయటకు వచ్చారు. అమర్ సింగ్ శిశ్యురాలిగా, ఉన్న ఆమే రెండు సార్లు లోక్ సభకు ఎంపికయ్యారు. కాగా గతంలొ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకర్గం నుండి పోటి చేసి గెలుపోందగా ప్రస్తుతం కూడ అదే స్థానం నుండి బిజేపి నుండి పోటి చేయనున్నట్టు సమాచారం.
కాగా రాంపూర్ స్థానం నుండి ఎస్పి అభ్యర్థి ఆజంఖాన్ పోటీకి దిగారు. ఇప్పుడదే పార్టీకి చెందిన ఆజంఖాన్పై జయప్రద పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆజంఖాన్పై ఆమె గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు. యూపీ ప్రజలకు జయప్రద సుపరిచితురాలు. పదేళ్లు ఎంపీగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.