మైసూరు మహారాజ కుమార్తె ఆరోగ్య పరిస్థితి విషమం, ఆయుధపూజ, బెంగళూరులో !
బెంగళూరు: మైసూరు దసరా ఉత్సవాల్లో స్పల్పఆటంకం ఎదురైయ్యింది. జయచామరాజేంద్ర ఒడయార్ చివరి పుత్రిక విశాలాక్షి దేవి (86) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దసరా ఉత్సవాల సందర్బంగా విశాలక్షి దేవి ఆసుపత్రిలో చేరడం మైసూరు మహారాజు వంశ్తస్తులను కలిచివేస్తుంది.
గురువారం మైసూరు ప్యాలెస్ లో రాజమాత ప్రమోదాదేవి ఆయుధ పూజ నిర్వహించాల్సి ఉంది. అయితే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో జయచామరాజేంద్ర ఒడయార్ చివరి పుత్రిక విశాలాక్ష్మి దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారని రాజమాత ప్రమోదదేవికి సమాచారం అందింది.
వెంటనే రాజమాత ప్రమోదాదేవి మైసూరు ప్యాలెస్ లో ఆయుధ పూజ నిర్వహించకుండా బెంగళూరు పయనం అయ్యారు. మైసూరు రాజవంశస్తుల సాంప్రధాయాలను పక్కన పెట్టి రాజమాత ప్రమోదా దేవి ఆయుధపూజ చెయ్యకుండా మొదటి సారి మైసూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారు.
మైసూరు ప్యాలెస్ రాజవంశస్తుడు యదువీర్ ఒడయార్ సాంప్రధాయ పద్దతిలో ఆయుధ పూజ నిర్వహిస్తున్నారు. జయచామరాజేంద్ర ఒడయార్ చివరి పుత్రిక విశాలాక్షి దేవి అనారోగ్యంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు.