వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందువల్లే జయలలిత వేలిముద్ర వేశారు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఫిజియో థెరపీ చికిత్స అందిస్తున్నారని, అందు వలనే ఆమె బీ-ఫామ్స్ లో సంతకాలు చెయ్యలేకపోయారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ అన్నారు.

తమిళనాడులోని మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల సందర్బంగా అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇచ్చిన సమయంలో జయలలిత సంతకంకు బదులుగా వేలిముద్రలు వేసిన విషయం తెలిసిందే. వేలిముద్రలు ఉండటంతో ఎన్నికల అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదు.

Jayalalithaa health, AIADMK Party spokesperson Panrutty S Ramachandran

ప్రభుత్వ వైద్యులు సహా జయలలిత వేలిముద్రలపై దృవీకరణ పత్రం ఇచ్చారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ గుర్తు చేశారు. అయితే కొంత మంది నాయకులు కుళ్లు రాజకీయలు చెయ్యడానికి ఈ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని రామచంద్రన్ మండిపడ్డారు.

జయలలిత ఆరోగ్యంపై పుకార్లు నమ్మరాదని ఆయన కార్యకర్తలకు మనవి చేశారు. అమ్మ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చెయ్యడానికి వస్తారని రామచంద్రన్ అన్నారు. అమ్మ కోసం ప్రజలు, పార్టీ కార్యకర్తలు చేసిన పూజలు ఫలించాయని అన్నాడీఎంకే నాయకుడు రామచంద్రన్ అన్నారు.

English summary
AIADMK Party spokesperson Panrutty S Ramachandran said he was confident that 68-year old Jayalalithaa, undergoing treatment at the Apollo Hospital since September 22, will return to work for the poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X