206 ఆలయాల్లో నిత్యాన్నదానం: జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత ఆ రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన 206 దేవాలయాలలో నిత్యాన్నదాన పథకం ప్రవేశ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా 10 వేలకు పైగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలలో ఈ పథకం అమలులోకి తీసుకు వచ్చారు. రూ. 2.24 కోట్ల విలువైన పూజా సామాగ్రిని దేవాలయాలకు అందించారు. ఇప్పటికే తమిళనాడులో ని ప్రసిద్ధి చెందిన దేవాలయాల పూర్తి రక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న జయలలిత ఆ జాబితాలోకి నిత్యాన్నదానం పథకం చేర్చారు. అదే విధంగా 820 మంది రోజువారి కార్మికులకు ఈ అన్నదాన పథకంలో భాగంగా వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు.
వినాయక చవితి పండుగ సందర్బంగా నాలుగు దేవాలయాలకు పూజా సామాగ్రి, ఇద్దరు రోజువారి కార్మికులకు వేతనాలు అందించిన కుమారి జయలలిత ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2002లో శ్రీ కబాలేశ్వర దేవాలయంలో నిత్య అన్నదానం ప్రారంభించారు. ప్రస్తుతం 500కు పైగా ఉన్న ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో అన్నదాన పథకం అమలు చేస్తున్నారు.