2011కంటే బాగా పెరిగిన జయ, విజయకాంత్ ఆస్తులు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు గత అయిదేళ్లలో రూ.62 కోట్ల మేర పెరిగాయి. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులు సరాసరి రూ.4.27 కోట్ల మేర పెరిగాయి. తమిళనాడు ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఈ వివరాలను వెల్లడించింది.
జయలలిత ఆస్తులు 2011లో రూ.51 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.113 కోట్లకు పెరిగాయి. జయలలిత ప్రస్తుతం శ్రీరంగం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను రూ.1,13,73,38,586గా చూపించారు. 2011లో రూ.51,40,67,979గా చూపించారు.
ఆ తర్వాత అన్నాడీఎంకేకు చెందిన శరత్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. 2011లో అతను రూ.27 కోట్ల ఆస్తులు చూపించారు. 2016లో రూ.64 కోట్లు చూపించారు. అన్నాడీఎంకే అధినేత విజయకాంత్ 2011లో రూ.27 కోట్లు చూపించారు. ఈసారి రూ.62 కోట్లు చూపించారు.
1957 నుంచి 12సార్లు గెలిచిన కరుణానిధి, రికార్డ్ఎమ్మెల్యేల ఆస్తుల సరాసరి 2011లో రూ.4.35 కోట్లుగా ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్యేల ఆస్తుల సరాకరి రూ.8.63 కోట్లుగా ఉంది. ఇవి మళ్లీ పోటీ చేస్తున్న 89 రీకాంటెస్టింగ్ ఎమ్మెల్యేలవి. వీరి ఆస్తులు 2011 నుంచి 2016 మధ్య 98 శాతం పెరిగాయి.