వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కొడుకుగా చెప్పుకొన్న కృష్ణమూర్తి జైలుకే, కారణమిదే?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

తప్పుడు ధృవీకరణపత్రాలతో కోర్టు సమయాన్ని వృధా చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, తెలుగు సినీ నటుడు శోభన్ బాబు లకు పుట్టిన కొడుకుగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు.

Jayalalithaa's self proclaimed 'son' to be jailed
అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలన్నీ ఫోర్జరీవని పోలీసులు తేల్చారు.దీంతో చట్టపరంగా కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.జయలలిత, శోభన్ బాబు దంపతులు తనను దత్తత తీసుకొన్నారంటూ ఆయన తప్పుడు ధృవీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు.

అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.దీంతో సోమవారం నాడు సీల్డ్ కవర్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా ఈరోడ్ కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.

English summary
Justice R Mahadevan of the Madras High court ordered the arrest of amanwho claimed to be late J Jayalalithaa's son. After perusing the reportfiled by the Inspector general of police, Crime branch, the judge saidthat Krishnamurthy, who had petitioned the court to acknowledge him asJayalalithaa's son had cheated the court and forged documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X