శరీరంపై కప్పుకునేందుకు: స్మృతి ఇరానీపై జేడీయూ నేత షాకింగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ పైన జేడీయూ నేత అన్వర్ అలీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. స్మృతి పైన అభ్యంతర వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మృతిని హెచ్ఆర్డీ నుంచి జౌళీ శాఖకు మార్చిన విషయం తెలిసిందే.
దీనిపై జేడీయు నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. జౌళీ శాఖ మంత్రిగా ఆమెను ఎంపిక చేయడం మంచిదేనని, తన శరీరాన్ని కప్పుకోవడానికి పదవి ఉపకరిస్తుందని దారుణ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రజల దుస్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. తాను ఎక్కడా సెక్సీ రిమార్క్ చేయలేదన్నారు. తప్పుగా మాట్లాడలేదని చెప్పారు.
అలీ అన్వర్ వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. ఇంత దారుణమైన వ్యాఖ్యలను తాను ఎప్పుడూ వినలేదన్నారు. గత ఏడాది దక్షిణ భారతీయ మహిళల రంగుపై జేడీయూ నేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పైన ఆయనకూ, స్మృతి ఇరానీకి మధ్య వాగ్యుద్ధం నడిచింది.