'ఏసుక్రీస్తు తమిళ హిందువు, పేరు కేశవ కృష్ణ!'
చెన్నై: ఏసుక్రీస్తు హిందువుగా జన్మించారని చెబుతూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) వ్యవస్థాపకుల్లో ఒకరు 1946లో రాశారు. దీనిని ముంబై బేస్డ్ రైట్ వింగ్ ట్రస్ట్ మరోసారి ముద్రించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
అందులోని సమాచారం మేరకు.. జీసస్ క్రైస్ట్ తమిళ హిందూ కుటుంబంలో జన్మించాడు. ఆ పుస్తకం పేరు 'క్రీస్తు పరిచయం'. దీనిని రాసిన వారు గణేష్ దామోదర్ (బాబారావు) సావర్కర్. ఇతను వినాయక దామోదర సావర్కర్ సోదరుడు.
ఆయన చెప్పిన దాని ప్రకారం జీసస్ విశ్వకర్మ బ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించాడు. మాతృభాష తమిళం. తద్వారా క్రిస్టియానిటీ అనేది హిందూమతంలో ఓ సెక్షన్ మాత్రమే. ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని ఫిబ్రవరి 26వ తేదీన మరాఠీలో తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఈ పుస్తకంలో క్రీస్తు పుట్టిన ప్రాంతం ఏమిటో చెప్పలేదు. పాలస్తీనా, అరబ్ భూభాగాలు ఒకప్పుడు హిందూ దేశంలోనివేనని, అక్కడి నుంచి క్రీస్తు భారత్ ట్రావెల్ చేశారని ఉంది. అంతేకాదు, ఏసుక్రీస్తు తన చివరి రోజుల్లో హిమాలయాలలో గడిపారని అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పుస్తకంలో ఉన్న సమాచారం వేరకు కొన్ని విషయాలు....
ఏసుక్రీస్తు
తమళ
విశ్వకర్మ
బ్రాహ్మిణ్.
అసలు
పేరు
కేశవ
కృష్ణ
మాతృభాష
తమిళం.
చూసేందుకు
చామనచాయగా
ఉంటారు.
ఏసుక్రీస్తుకు
12
ఏళ్ల
వయస్సు
వచ్చినప్పుడు
బ్రాహ్మిణ్
సంప్రదాయం
ప్రకారం
చేసే
'జనేయు'
చేశారు.
కుటుంబం
భారత
వేషధారణలోనే
ఉండేది.
క్రిస్టియానిటీ
అనేది
ప్రత్యేక
మతం
కాదు.
ఇది
హిందూ
ధర్మంలో
ఓ
భాగం.
తన
చివరి
రోజులను
హిమాలయాలలో
గడిపారు.
శివుడికి
మూడేళ్ల
పాటు
పూజలు
చేశారు.
శివున్ని
దర్శించుకున్నారు.
అరేబియా
హిందూ
భూమి.
జ్యూస్లు
హిందువులు.
అరబిక్లో
ఎన్నో
సంస్కృత,
తమిళ
పదాలు
ఉన్నాయి.