వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో ఘోరం: ఎంజీఎం ఆస్పత్రిలో 52మంది చిన్నారుల మృతి
గోరఖ్పూర్ ఆస్పత్రి పెను విషాదం మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. జార్ఖండ్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రి
జంషెడ్పూర్: గోరఖ్పూర్ ఆస్పత్రి పెను విషాదం మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. జార్ఖండ్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.
జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52మంది పిల్లలు చనిపోయారు. కాగా, చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్పత్రి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు.
ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో సుమారు 79మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనల్లోనూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.
Comments
English summary
As if the deaths of children owing to the shortage of oxygen supply at Gorakhpur did not shake the authorities, another similar report has surfaced from Jharkhand.
Story first published: Sunday, August 27, 2017, 10:33 [IST]