Jharkhand Exit Poll Results 2019 Live: కాంగ్రెస్కే పట్టం కట్టిన రిపబ్లిక్ జన్ కీ బాత్ పోల్
జార్ఖండ్లో చివరిదశ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అవుతాయి. శుక్రవారం సాయంత్రం చివరి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం ఐదు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఓటర్ మూడ్, ట్రెండ్స్తో పాటు ఇతరత్ర అంశాలను తీసుకుని రాష్ట్రంలో సర్వేలు నిర్వహించారు. జార్ఖండ్ ఎన్నికల్లో ఓటర్ నాడి ఎలాగుందో అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియనుంది.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి నాలుగు దశల్లో 65 స్థానాలకు పోలింగ్ ముగియగా మిగతా 16 స్థానాలకు పోలింగ్ చివరి దశలో జరిగింది. చివరి దశలో హేమా హేమీలు పోటీపడ్డారు.
నవంబర్ 30వ తేదీన తొలి దశపోలింగ్ ప్రారంభం అవగా డిసెంబర్ 16వ తేదీన నాల్గవ దశ పోలింగ్ ముగిసింది. ఇక శుక్రవారం ఐదవ దశకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం వన్ఇండియాను ఫాలో అవ్వండి.