పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, యువతిపై 12 మంది, సాముహికంగా.. లైంగికదాడి, పోలీసుల అదుపులో...
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 12 మంది, పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి మరీ యువతిని లైంగికదాడి చేశారు. జార్ఖండ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. తన స్నేహితుడితో కలిసి వెళ్తున్న యువతిని గ్యాంగ్ రేపి చేసి.. హింసించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. 48 గంటల్లోనే నిందితులను బోనులో నిలబెట్టారు.
అటకాయించి..
సరిగ్గా రెండురోజుల క్రితం.. 26వ తేదీ లా విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి జార్ఖండ్లో రహదారిపై వెళ్తున్నాడు. ఇంతలో కొందరు యువకులు వచ్చారు. 12 మందిలో ఒకడు గన్ తీసి పాయింట్ బ్లాంక్లో పెట్టాడు. ఇంకేముంది యువతి, యువకుడు గజ గజ వణికిపోయారు. యువతిని సమీపంలోని ఇటుక బట్టి పొదల్లోకి తీసుకెళ్లారు.
12 మంది కలిసి..
అలా ఒకరి తర్వాత ఒకరు 12 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టీ మరీ ఆకృత్యానికి పాల్పడ్డారు. తర్వాత వారు జరిగిన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీరియస్గా తీసుకున్న ఖాకీలు.. 48 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, బైక్, రెండు మ్యాగజైన్లు, మూడు బుల్లెట్లు, దేశీయ తూపాకీ, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫోన్ ధ్వంసమైనట్టు పోలీసులు గుర్తించారు.
వీరే నిందితులు
నిందితులు సునీల్ మందా, కుల్దీప్ ఒరాన్, సందీప్ తిర్కీ, అజయ్ ముందా, రాజన్ ఒరాన్, నవీన్ ఒరాన్, అమన్ ఒరాన్, బసంత్ కుచ్చాప్, రవి ఒరాన్, రోహిత్ ఒరాన్, రిషి ఒరాన్ను అరెస్ట్ చేసినట్టు కంకే పోలీసులు వివరించారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
Recommended Video
ఖండన
ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. యువతిపై సాముహిక అత్యాచారాన్ని మేధావులు ముక్తకంఠంతో ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.