వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపిస్టును చంపేసి శవాన్ని ఇంట్లో పెట్టిన స్త్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

రాంచీ: తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఓ మహిళ దారుణంగా కక్ష తీర్చుకుంది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని హత్య చేసి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని శుక్రవారంనాడు వెల్లడించారు.

బాధితురాలు ఇళ్లలో పనిచేసుకుంటూ స్థానిక హౌసింగ్ సొసైటీలో నివసిస్తోంది. బుధవారం తెల్లవారు జామును ఇంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్ (24) ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తన చేతికి అందిన సుత్తితో అతడి తలపై ఆమె బలంగా కొట్టింది.

Molesting

తీవ్రమైన ఆగ్రహంతో అతని ముఖాన్ని ఛిద్రం చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ మర్నాడు ఉదయం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి యధావిధిగా పనికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమనుకుందో గానీ అదే రోజు రాత్రి స్థానిక ఆర్గోరా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. మృతుడు మనోజ్ కుమార్, బాధితారులు ఇద్దరు కూడా కుంటి జిల్లాలోని అంబా టోలీ గ్రామానికి చెందినవారు.

English summary
A woman employed as a maid at Ranchi’s Harmu Housing Colony killed a man after he entered her residence and raped her, police said on Friday. She later surrendered before the Argora police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X