మహిళతో సంబంధం: జెఎన్యూ పీహెచ్డీ విద్యార్ధి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని బెర్ సరాయిలోని తాను ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని రీసెర్చ్ స్కాలర్ దుశ్యంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
బెర్సరాయిలోని విద్యార్ధులు, వర్కింగ్ మెన్లు నివాసం ఉంటే అపార్ట్మెంట్లో తొమ్మిది గదుల్లో ఒక గదిలో గురువారం ఉదయం దుశ్యంత్ విగత జీవిగా కనిపించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి, దర్యాప్తును ప్రారంభించారు. దుశ్యంత్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని బరేలి. వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పాటు ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధమే తన ఆత్మహత్యకు కారణమని దుశ్యంత్ సూసైట్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అసే రీసెర్చ్ స్కాలర్ విద్యార్ధి చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. హెచ్సీయూ ఘటనపై సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రెండుసార్లు వచ్చారు.