వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళతో సంబంధం: జెఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్ధి ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని బెర్ సరాయిలోని తాను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని రీసెర్చ్ స్కాలర్ దుశ్యంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

JNU PhD student commits suicide in south Delhi, probe on

బెర్‌సరాయిలోని విద్యార్ధులు, వర్కింగ్ మెన్‌లు నివాసం ఉంటే అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది గదుల్లో ఒక గదిలో గురువారం ఉదయం దుశ్యంత్ విగత జీవిగా కనిపించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి, దర్యాప్తును ప్రారంభించారు. దుశ్యంత్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బరేలి. వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పాటు ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధమే తన ఆత్మహత్యకు కారణమని దుశ్యంత్ సూసైట్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అసే రీసెర్చ్ స్కాలర్ విద్యార్ధి చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూ ఘటనపై సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రెండుసార్లు వచ్చారు.

English summary
The deceased, Dushyant, a native of Bareily in UP, left a suicide note in which he mentioned about some personal problems, including family issues and his relationship with a woman, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X