జేఎన్యూలో పీహెచ్డీ విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం వసతి గృహంలో ఓ పీహెచ్డీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మణిపూర్కి చెందిన పీహెచ్డీ విద్యార్థి జేఆర్ ఫిలెమన్ గత మూడు రోజులుగా కనిపించడంలేదు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అతని గది నుంచి దుర్వాసన రావడంతో అక్కడి విద్యార్థులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. గదిలో ఫిలమెన్ మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
అయితే, మృతుని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించడకపోవడం విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. అతని గది లోపలి నుంచే లాక్ చేసి ఉండటం, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో.. ఎక్కువ మొతాదులో మద్యం తీసుకోవడం వల్లే అతను మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఇదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నజీబ్ అహ్మద్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. నజీబ్ ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోలీసులను ఆదేశించారు. దీంతో విద్యార్థి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించారు.