ఉద్యోగం లేదని కొడుకులను చంపిన తండ్రి: ఆత్మహత్య
జగ్తర్ సింగ్, అతని కుమారులు గౌరవ్దీప్ సింగ్ (13), హర్షదీప్ సింగ్ (12) ఒకే గదిలో మృతదేహాలుగా పడివున్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. జగ్తర్ సింగ్ కుమారులిద్దరూ మొహాలీలోని దేవ్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. కాగా శనివారం రాత్రి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చిన తండ్రి జాగ్తర్, వారిని గొంతుకు పిసికి హత్య చేశాడు. తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనకు ముందే జగ్తర్ తన భార్య ఛరణ్జీత్ కౌర్ను తన తల్లిగారింటికి పంపించేశాడు. కాగా జగ్తర్ సింగ్ తల్లి గురుదేవ్ కౌర్ (80) టీ చేసేందుకు మొదటి అంతస్తులో నుంచి కిందికి వచ్చింది. ఆ గదిలో ముగ్గురు మృతి చెంది ఉండటంతో చూసిన కౌర్ కేకలు వేయడంతో ఇతర కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జగ్తర్ సింగ్కు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని స్థానికులు చెబుతున్నారు.
జగ్తర్ తన తొంటి ఆపరేషన్ కోసం ఇప్పటికే అప్పులు చేశాడని, ఉద్యోగం కూడా లేకపోవడంతో అప్పుల బాధ, పేదరికం తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అంటున్నారు. తొంటి నొప్పి కారణంగా తన భార్యతో కూడా జగ్తర్ సింగ్ పలుమార్లు గొడవపడ్డట్లు చెబుతున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మొహాలీలోని ఆస్పత్రికి తరలించారు.