క్రైం రిపోర్టర్ హత్యకు షార్ప్ షూటర్ కు కిరాయి: హాయ్ బెంగళూరు ఎడిటర్ కు బెయిల్!
బెంగళూరు: సీనియర్ క్రైం రిపోర్టర్ సునీల్ హత్యకు కిరాయి ఇచ్చారని ఆరోపిస్తూ అరెస్టు అయిన హాయ్ బెంగళూరు పత్రిక ఎడిటర్ రవి బెళగెరెకి బుధవారం బెంగళూరు సెషన్స్ కోర్టు షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది.
ఇద్దరు వ్యక్తుల పూచీ, లక్ష రుపాల బాండ్ ఇవ్వాలని, బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణకు సహకరించాలని బెంగళూరు సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రవి బెళగెరెని బుధవారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి అంబులెన్స్ లో జయదేవ ఆసుపత్రికి తరలించారు.
రవి బెళగెరె జయదేవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ క్రిమినల్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో రవి బెళగెరెకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని ఆయన న్యావాది దివాకర్ కోర్టులో చెప్పారు.
ఆనారోగ్యంతో బాధపడుతున్న రవి బెళగెరెకి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాది దివాకర్ కోర్టులో వాదించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం డిసెంబర్ 16వ తేదీ వరకు రవి బెళగెరెకి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.