ఐసిజే తీర్పు ఆంగ్లంలో ఉంది... అందుకే పాక్కు అర్థం కాలేదు... కేంద్రమంత్రి
నౌకాదళ రిటైర్డ్ ఉద్యోగి కుల్భూషణ్ పాకిస్థాన్ సైనిక స్థానం విధించిన మరణశిక్షపై ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం పున:సమీక్షించాలని కోరిన నేపథ్యంలోనే పాకిస్థాన్ మాత్రం ఈ తీర్పును తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ స్పిందిస్తూ ఆ తీర్పు పాకిస్థాన్ విజయంగా అభివర్ణించాయి. ఇది పాకిస్థాన్ విజయమంటూ ప్రభుత్వ వర్గాలు ట్వీట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కుల్భూషణ్ జాదవ్ను విడుదల చేసి స్వదేశానికి రప్పించుకోవాలనే భారత్ డిమాండ్ను ఐసీజే తిరస్కరించిందని అందుకే ఇది పాకిస్థాన్కు పెద్ద విజయమని పేర్కోంది.
అయితే ఐసీజే తీర్పును తమకు అనుకూలంగా మార్చుకున్న పాకిస్థాన్పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగాస్త్రాలను విసిరారు. ఓవైపు ఉరిశిక్షను ఆపమని ఐసిజే తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే పాకిస్థాన్ మాత్రం తమ విజయంగా చెప్పుకోవడంతో ఆయన సెటైర్లు వేశారు. పాకిస్థాన్కు బాష అర్థం కాక తప్పుగా అర్థం చేసుకుందనే భావంతో ఆయన ట్విట్టర్లో ఈ విధంగా పేర్కోన్నారు. "ఐసిజే తీర్పు ఇంగ్లీష్లో వెలువవడడం వల్ల పాకిస్థాన్ అలా అర్థం చేసుకుందని'' ట్వీట్ చేశారు.