కబాలి ఎఫెక్ట్: బెంగళూరు నుంచి చెన్నైకు ప్రత్యేక ప్లైట్
బెంగళూరు: సూపర్ స్టార్ రజనీకాంత్కు ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.య త్వరలో రజనీకాంత్ నటించిన కబాలి సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల కోసం ఏకంగా విమానం నడవనుంది.
కబాలి చిత్రం గురించి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రోమోలో రజనీకాంత్ అలరించాడు. ఈ సినిమా కోసం ఎయిర్ ఎసియా విమానయాన సంస్థ.. కబాలి సినిమా విడుదల రోజున ప్రత్యేక విమానాలు నడిపించనుంది.
కబాలి సినిమా కోసం బెంగళూరు నుంచి చెన్నైకు జూలై 15వ తేదీ నుంచి ఎయిర్ ఎసియా బయలుదేరనుంది. ఆ రోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరి చెన్నైకి ఫ్లైట్ ఏడు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది.
తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి నాలుగు గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. దీని ధర రూ.7,860గా నిర్ణయించారు. ఇది విమాన టిక్కెట్తో పాటు కబాలి మూవీ టిక్కెట్, ఆడియో సీడీ, బ్రేక ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్... ఇవికాక చెన్నై విమానాశ్రయం నుంచి సినిమా థియేటర్కు రవాణా ఛార్జీలు కూడా ఏర్పాటు చేశారు. సినిమా కోసం ఇలా ప్రత్యేక విమానం తొలిసారి కావొచ్చు.