వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళీమాతకు అభిషేకం.. భారీగా మానవ రక్తం! కేరళలో పోస్టర్ సంచలనం..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: దేవుళ్లు, దేవతలకు అభిషేకాలు చేయడం మామూలే. ఇందుకు పాలు, వివిధ తైలాలు ఉపయోగిస్తుంటారు. కొన్ని ఆలయాల్లో జంతువులను బలి ఇచ్చి వాటి రక్తంతో అభిషేకం చేయడం కూడా విన్నాం.. చూశాం. ఇక మనుషుల రక్తంతో అభిషేకం చేయడం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం.

కానీ కేరళలో ఇటీవల వెలిసిన ఓ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరచడమేకాదు చర్చనీయాంశంగా కూడా మారింది. అక్కడి కాళీమాత ఆలయానికి అభిషేకం చేసేందుకు భారీగా రక్తం కావాలని, దానికోసం భక్తులు వీలైనంత త్వరగా వారి రక్తాన్ని దానంగా పంపించాలనేది ఆ పోస్టర్‌‌లోని సారాంశం.

Kali Mata Temple Officials asked Devotees to send Human Blood for Abhishekam

తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధుర అనే గ్రామ ఆలయ అధికారులు ఈ మేరకు బహిరంగంగా ప్రకటన చేశారు. పోస్టర్లు వేయించారు. ఈ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో భాగంగా రక్తాభిషేకం చేయాల్సి ఉన్నందున భక్తులంతా త్వరగా వారి రక్తాన్ని దానం చేసి ఆలయానికి పంపించాలంటూ అందులో ప్రకటించారు.

విచిత్రం ఏమిటంటే.. భక్తుల వద్ద నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన వైద్యులే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని కూడా ఆ ప్రకటనలో వెల్లడించడం. మార్చి 12న సాయంత్రం 6 గంటలకు ఈ ఉత్సవం జరగనుందట. ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. మొత్తం పధ్నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలోని రెండో రోజున కాళీమాతకు రక్తాభిషేకం నిర్వహిస్తారు.

English summary
In Vithura Village of Thiruvananthapuram, Kerala State, Kali Mata temple officials announced that they require human blood for abhishekam which will be held on March 12 evening. They announced this in a poster and asked the devotees to send the blood. This Abhishekam will be performed on the Second day of total 14 days celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X