కమల్ హాసన్ పార్టీకి కేటాయించిన గుర్తునే కొనసాగించిన కమల్ హాసన్: కీలక అంశాలివే.
చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్ పార్టీకి టార్చ్లైట్ గుర్తునే కేటాయించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసింది.
అయితే, ఎన్నికల సంఘం 'టార్చ్ లైట్'ను తమిళనాడులోని ఎంజీఆర్ మక్కల్ కచ్చి అనే రాజకీయ సంస్థతో పాటు పుదుచ్చేరిలోని ఎంఎన్ఎంకు కూడా కేటాయించింది. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. టార్చ్ లైట్ గుర్తును తమకే కేటాయించేలా కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇక ఎంజీఆర్ మక్కల్ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ విశ్వనాథన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎంజీఆర్ విగ్రహం, ఆయనతో దగ్గరి సంబంధం ఉండేలా మరేదైనా గుర్తు తమకు కేటాయించాలని ఆయన ఈసీని కోరారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకే టార్చ్ లైట్ గుర్తు దక్కడంపై కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. అణగారిన ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పుట్టిన రోజునాడు తమకు ఈ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘానినికి, ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.