ఏపీ సీఎం జగన్కు కమల్ హాసన్ ధన్యవాదాలు - ఇది భారతీయుల కోరిక అంటూ ప్రశంస..
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును ప్రధానం చేయాలంటూ ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం అభినందనీయమని కమల్ కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు.
Recommended Video
పోలీస్ బాస్ రాసలీలలు: బయటపెట్టిన భార్యపై దాడి - వీడియో వైరల్ - సీఎం సీరియస్ - విదేశాల్లో విలాసాలు
''గౌరవ ఏపీ సీఎం జగన్ గారూ.. మీకు నా ధన్యవాదాలు. మా సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గౌరవించుకోవడం కోసం మీరు చేసిన విన్నపం నిజంగా సెంటిమెంట్ లాంటిదే. తమిళనాడులోనేకాదు, దేశమంతటా ఉన్న బాలు అభిమానులు దీనినే కోరుతున్నారు'' అని కమల్ హాసన్ తన లేఖలో పేర్కొన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 'భారతరత్న' ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాసిన లేఖలో.. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని జగన్ కోరారు. ఐదు దశాబ్దాల మర్చిపోలేని సేవలు అందించిన ఆయనకు ఇది సముచిత గుర్తింపు అవుతుందని, గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం జగన్ తన లేఖలో ప్రస్తావించారు.
Thank you Honourable CM of Andhra Pradesh. @AndhraPradeshCM.
— Kamal Haasan (@ikamalhaasan) September 28, 2020
The honour you seek for our brother Shri.S.P.Balasubramaniam is a sentiment which true fans of his voice will echo, not only in Tamilnadu but throughout the whole nation. pic.twitter.com/eSeC4MnR8p