రాజకీయాల్లోకి కంగనా రనౌత్: నిజమేనా, అమె ఏమంటోంది?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మనసులో ఎదీ పెట్టుకోదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. అందువల్ల ఆమె చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్వీన్ కంగనా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తాజాగా ఊహాగానాలు చెలరేగాయి.
అయితే, అందులో ఏ మేరకు నిజం ఉందనే విషయాన్ని కంగన అధికార ప్రతినిధి స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసినట్లు బొంబాయి టైమ్స్ రాసింది. మీడియాలో బురద జల్లే పుకార్లు షికార్లు చేస్తున్నాయని అన్నారు.
కంగనా బిజెపిలో చేరుతారంటూ
కంగనా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని ఆమె కలుసుకున్నారంటూ పుకార్లకు రెక్కలు వచ్చాయి. ఫలానా పార్టీలో చేరుతారంటూ కంగనాపై ప్రచారం జరుగుతోందని, అందులో ఏ మాత్రం నిజం లేదని ఆమె అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
అటువంటి భేటీయే జరగలేదు...
మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ప్రధానితో కంగనా భేటీ అయిట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని ఆమె అధికార ప్రతినిధి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కంగనా చాలాసార్లు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
షూటింగ్లో బిజీగా ఉన్నారు...
కంగనా ప్రస్తుతం షూటింగులో తీరిక లేకుండా ఉన్నారని అధికార ప్రతినిధి చెప్పారు. బికనూరులో మణికర్ణిక షూటింగ్లో పాల్గొంటున్నట్ల తెలిపారు. వరుసగా మరిన్ని సినిమాలున్నాయని కూడా చెప్పారు.
పుకార్లు వద్దని...
అవాస్తవాలతో కూడిన పుకార్లను దయచేసి నమ్మవద్దని కంగనా అధికార ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కంగనా అధికారిక ప్రకటన చేస్తారని అన్నారు. రాణి లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న మణికర్ణిక సినిమాలో కంగనా ప్రస్తుతం నటిస్తున్నారు.