వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగనా రనౌత్‌కు గవర్నర్ టైమ్ - నేడు రాజ్‌భవన్‌లో భేటీ - మహారాష్ట్ర సర్కారుపై కోశ్యారీ అసహనం

|
Google Oneindia TeluguNews

శివసేన కూటమి సర్కార్ వర్సెస్ నటి కంగనా రనౌత్ అన్నట్లుగా సాగుతోన్న వివాదాల పరంపరలో కీలక మలుపు చోటుచేసుకోనున్నది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతంలో మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమ్శలు చేయడం, ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణించడంతో నటిపై ఆగ్రహించిన ప్రభుత్వం... జుహూలోని ఆమె కార్యాలయాన్ని పడగొట్టడం తెలిసిందే. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన కంగన.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ సహా ఎన్టీఏలోని పలు పార్టీలు మద్దతుగా నిలిచాయి. తాజాగా..

తనపై కేసులు, బిల్డింగ్ కూల్చివేత అంశాలపై మహారాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు కంగనా రనౌత్ రెడీ అయ్యారు. ముంబైలోని రాజ్ భవన్‌లో ఆదివారం సాయంత్రం 4.30కు ఆమెకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అపాయింట్మెంట్ ఇచ్చారు. శివసేనతో వివాదం నేపథ్యంలో కంగన గవర్నర్‌ను కలవనుండటం చర్చనీయాంశమైంది.

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదుచైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

Kangana Ranaut row: Actor to meet Maharashtra governor Koshyari on sunday

కంగనా రనౌత్ చుట్టూ నెలకొన్న వివాదాలను గవర్నర్ కోష్యారీ మొదటి నుంచీ నశితంగా గమనిస్తున్నారు. బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాలీహిల్‌లోని ఆమె కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ కూల్చేసిన సందర్భంలో గవర్నర్.. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాన సలహాదారు అజోయ్ మెహతాను పిలిచి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కూల్చివేత చర్యను ఖండించారు.

Recommended Video

Kangana Ranaut Reaches Mumbai Under Heavy Protection || Oneindia Telugu

మరోవైపు, మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథావాలే కంగనా రనౌత్ అంశంలోనే శుక్రవారం గవర్నర్ కోష్యారీని కలిశారు. బిల్డింగ్ కూల్చివేత, కేసుల విషయంలో కంగనకు న్యాయం జరిగేలా చూడాలని, అవసరమైతే బీఎంసీ చేత ఆమెకు నష్టపరిహారం కూడా ఇప్పించాలని అథవాలే కోరారు.

English summary
Actor Kangana Ranaut will today meet Maharashtra governor Bhagat Singh Koshyari, days after her office in Bandra was demolished by the Brihanmumbai Municipal Corporation (BMC). Earlier, Koshyari had expressed displeasure over the handling of the Kangana Ranaut episode and the manner in which the Mumbai civic body razed "illegal alterations" at her bungalow. The governor had summoned Chief Minister Uddhav Thackeray's principal advisor Ajoy Mehta the same the demolition was carried out. He had conveyed his displeasure over the entire matter. The meeting went on for 20 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X