ముంబై.. పీవోకేనా.. సంజయ్ రౌత్ బెదిరింపులపై కంగనా రనౌత్ ఫైర్..
ముంబై.. పాక్ ఆక్రమిత కశ్మీరా.. అని నటి కంగనా రనౌత్ ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కంగనా చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. దీనికి శివసేన నేత సంజయ్ రౌత్ కూడా అదేవిధంగా స్పందించారు. అలా ముంబైలో అడుగుపెట్టొద్దని అనడంతో వివాదం పీక్కి చేరింది.
ముంబై సిటీ పాక్ ఆక్రమిత కశ్మీర్ను తలపిస్తోందని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో ముంబై పోలీసుల తీరుపై కంగన రనౌత్ విమర్శలు చేస్తున్నారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టొద్దని సామ్నా పత్రికలో పేర్కొన్నారు.
Recommended Video
దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో అడుగు పెట్టొద్దని సంజయ్ రౌత్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ట్వీట్ చేశారు. సుశాంత్ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే ముంబై పోలీసులను విశ్వసించలేదు అని కంగనా తెలిపారు. రక్షణ విషయంలో అభద్రతగా ఫీలైతే బాలీవుడ్ను, ముంబైని ద్వేషించినట్లవుతుందా అని కంగనా రనౌత్ ప్రశ్నించారు.