వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై.. పీవోకేనా.. సంజయ్ రౌత్ బెదిరింపులపై కంగనా రనౌత్ ఫైర్..

|
Google Oneindia TeluguNews

ముంబై.. పాక్ ఆక్రమిత కశ్మీరా.. అని నటి కంగనా రనౌత్ ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కంగనా చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. దీనికి శివసేన నేత సంజయ్ రౌత్ కూడా అదేవిధంగా స్పందించారు. అలా ముంబైలో అడుగుపెట్టొద్దని అనడంతో వివాదం పీక్‌కి చేరింది.

 Kangana Ranaut says Mumbai feels like PoK

ముంబై సిటీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసుల తీరుపై కంగన రనౌత్ విమర్శలు చేస్తున్నారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టొద్దని సామ్నా పత్రికలో పేర్కొన్నారు.

Recommended Video

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు కొకైన్ బానిసలు అని పుకారు ఉంది | Bollywood || Oneindia Telugu

దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో అడుగు పెట్టొద్దని సంజయ్ రౌత్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ అని ట్వీట్ చేశారు. సుశాంత్ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే ముంబై పోలీసులను విశ్వసించలేదు అని కంగనా తెలిపారు. రక్షణ విషయంలో అభద్రతగా ఫీలైతే బాలీవుడ్‌ను, ముంబైని ద్వేషించినట్లవుతుందా అని కంగనా రనౌత్ ప్రశ్నించారు.

English summary
Kangana went on to say that she feared Mumbai Police more than the movie mafia goons. After a series of such derogatory tweets against the Mumbai Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X