కంగారు కోర్టు శిక్ష: 12 మందితో రేప్ చేయించారు
పశ్చిమ బెంగాల్ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో గల బిర్భూమి జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో ఈ అత్యంత సిగ్గుచేటైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం - అమ్మాయిని రెండు వేల రూపాయల జరిమానా విధించాలని గ్రామానికి చెందిన పెద్దల కోర్టు ఆదేశించింది.
ఆ మొత్తం చెల్లించలేమని కుటుంబం చెప్పడంతో ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేయాలని గ్రామ పెద్ద ఆదేశించాడు. ఆ సంఘటనపై ఆ గిరిజన యువతి లాభ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం సూరిలోని ఆస్పత్రికి పంపించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామానికి చెందిన 13 మందిపై యువతి ఫిర్యాదు చేసింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటిండెంట్ ప్రశాంత చౌదరి చెప్పారు.
ఇదే జిల్లాలో నాలుగేళ్ల క్రితం మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఓ గిరిజన యువతిని నగ్నంగా ఊరేగించారు.