వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కన్హయ్య కుమార్ కాన్వాయ్ పైన బీహార్లో దాడి, పలువురికి గాయాలు
పాట్నా: జెఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాన్వాయ్ పైన మంగళవారం బీహార్లో దాడి జరిగింది. బెగుసరాయి జిల్లాలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో కన్హయ్య కుమార్ మద్దతుదారులు ప్రతిదాడికి దిగారు.
ఓ ప్రాంతంలో కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం వారు ర్యాలీగా బయలుదేరారు. ఈ సమయంలో దాడి జరిగింది. కన్హయ్య మద్దతుదారులు, దాడికి దిగిన గ్రూపులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
కన్హయ్య కుమార్ వచ్చే ఏడాది సిపిఐలో చేరి, బెగుసరాయ్ నుంచి లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే చర్చలు జరిగాయి.
Comments
English summary
Former JNU student union leader Kanhaiya Kumar's convoy was attacked in Bihar's Begusarai district on Tuesday. Some people have been injured and several vehicles were vandalised in the attack.
Story first published: Tuesday, October 16, 2018, 22:12 [IST]