నటి పూజా గాంధీ రూ. కోటి మోసం: ఫిర్యాదు
బెంగళూరు: నటి, నిర్మాత పూజా గాంధీ రూ. కోటి రుణం తీసుకుని తిరిగి ఇవ్వలేదని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. కన్నడ నటుడు, నిర్మాత, ఫైనాన్షియర్ సురేష్ శర్మ పూజా గాంధీ మీద ఫిర్యాదు చేశారు.
కన్నడలో తిప్పాజీ సర్కిల్ అనే సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో పూజా గాంధీ తిప్పాజీ పాత్రలో నటించింది. ఆమె భర్తగా సురేష్ శర్మ నటించారు. అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అయ్యారు. తరువాత పూజా గాంధీ సొంతంగా అభినేత్రి అనే సినిమా నిర్మించారు.
ఒక నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రానికి పూజా గాంధీ నిర్మాత. అభినేత్రి పాత్రలో ఆమె నటించారు. అభినేత్రి సినిమా పోస్టు ప్రొడక్షన్ సమయంలో తన దగ్గర పూజా గాంధీ రూ. ఒక కోటి తీసుకున్నదని, గడువు పూర్తి అయినా తిరిగి ఇవ్వలేదని సురేష్ శర్మ ఫిర్యాదు చేశారు.
అయితే తను ఎవ్వరి దగ్గర రుణం తీసుకుకోలేదని, అలా తీసుకుని ఉంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా అని పూజా గాంధీ ప్రశ్నిస్తున్నారు. సురేష్ శర్మ దగ్గర ఎదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని పూజా గాంధీ సవాలు చేస్తున్నారు.