మహిళలపై అత్యాచారం: బుల్లితెర నటుడితో సహ ముగ్గురు అరెస్టు, ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే !
బెంగళూరు: ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేశారని నమోదు అయిన కేసులో కన్నడ బుల్లితెర నటుడితో సహ ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను వైద్యపరీక్షలకు తరలించి నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రాజేష్ (24), కారు డ్రైవర్ మణికాంత్ (25), పానీపూరి సూర్య (23) అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహిళలు ఉన్న ఇంటిలో ప్రవేశించిన నిందితులు కత్తులతో వారిని బెదిరించి అత్యాచారం చేశారని పోలీసులు అంటున్నారు.
కోరమంగళలో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు ఆన్ లో భోజనం బుక్ చేసుకున్నారు. ఆహారం కోసం వేచి చూస్తన్న సమయంలో రాత్రి 8.20 గంటలకు ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో మహిళలు తలుపు తీశారు. ఆ సమయంలో నిందితులు ఇంటిలో చోరబడి కత్తులతో బెదిరించి ఇద్దరు మహిళ మీద అత్యాచం చేశారని భాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు భాదితులు తెలిపిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కన్నడ బుల్లితెర నటుడు ఒకరు ఉన్నారని పోలీసులు అన్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మనవి చేస్తున్నారు.