చెకింగ్ పేరుతో ఈవ్టీజింగ్: కళాశాల ప్రిన్సిపాల్పై కేసు నమోదు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ కళాశాల ప్రిన్పిపాల్తో ఐదుగురు స్టాఫ్ సభ్యులు ఈవ్ టీజర్స్గా మారారు. పాలిటెక్నిక్ కళాశాల మహిళా విద్యార్ధినుల హాస్టల్లో శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాన్పూర్లోని నవాబ్గంజ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ ఖాన్, స్టెన్గ్రాఫర్ సీకే ఉపాధ్యాయ్, మరో నలుగురు వ్యక్తులు మహిళా విద్యార్ధినులు హాస్టల్స్లో చెకింగ్ పేరుతో ఈవ్ టీజింగ్కు పాల్పడ్డారు.
దీంతో, విద్యార్ధినులు శనివారం ఆందోళనకు దిగారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్ను ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని వారు ధర్నాకు దిగారు. విద్యార్ధినుల ఫిర్యాదు మేరకు నిందులపై ఐపీసీ సెక్షన్లు 354, 511 కింద కేసు నమోదు చేసినట్టు స్వరూప్ నగర్ సర్కిల్ ఆఫీసర్ ఆతీష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.