ఆసుపత్రిలో ఉన్న భార్యను కిడ్నాప్ చేసి ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్ చేసిన భర్త !
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి పరారైన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో నిందితులు ముగ్గురు
కాన్పూర్: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి పరారైన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో నిందితులు ముగ్గురు పరారైనారని పోలీసులు చెప్పారు.
కాన్పూర్ కు చెందిన మహిళ భర్తతో విభేదాలు రావడంతో ఇటీవల భర్తకు దూరంగా ఉంటూ అదే ప్రాంతంలోని తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది. అనారోగ్యం కారణంగా ఆమె కాన్పూర్ లోని ఉర్సుల హార్స్మన్ ఆసుపత్రిలో చేరింది.
చికిత్స పొందుతున్న సమయంలో ఆమె భర్త తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉర్సుల హార్స్మన్ ఆసుపత్రిలోకి వెళ్లాడు. తరువాత భార్యకు మత్తు మందు ఇచ్చి అపస్మాకర స్థితిలోకి వెళ్లిన ఆమెను కిడ్నాప్ చేసి నిర్జనప్రదేశంలోని తీసుకు వెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు.
తరువాత ఆమెను కాకాడియో ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్జనప్రదేశంలో వదిలిపెట్టి అక్కడి నుంచి పరారైనారు. మరుసటి రోజు స్పృహరావడంతో తాను కుటుంబ సభ్యులను సంప్రదించి మళ్లీ ఆసుపత్రిలో చేరానని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని. నిందితుల కోసం గాలించగా ఆమె భర్తతో సహ ముగ్గురు పరారైనారని పోలీసులు అన్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించి దర్యాప్తు చేయిస్తున్నామని, పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి రవీంద్ర కుమార్ విశిష్ట తెలిపారు.