కపిల్ మిశ్రా ఓ స్టూపిడ్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి విమర్శలు
మంత్రివర్గ్ నుండి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై ఆప్ అధ్యక్షుడు , డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కూడ విమర్శలు ఎక్కుపెట్టారు.
న్యూఢిల్లీ: మంత్రివర్గ్ నుండి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై ఆప్ అధ్యక్షుడు , డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కూడ విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆమె తన మరిది ఇక లేరంటూ ట్వీట్ చేశారు. కపిల్ మిశ్రా ఓ స్టూపిడ్ అంటూ ఆమె పేర్కొన్నారు. తన ముందే అరవింద్ కేజ్రీవాల్ కు మంత్రి సత్యేంద్రజైన్ నుండి రూజ 2 కోట్లు తీసుకొన్నారంటూ కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ బంధువుల భూవివాదాన్ని రూ.50 కోట్లకు సెటిల్ చేసినట్టు సత్యేంద్రజైన్ వ్యక్తిగతంగా తనకు చెప్పారంటూ కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ స్పందించారు.
కపిల్ కు తలకాయలేదన్నారు.ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మంత్రివర్గం నుండి తొలగించారన్న అక్కసుతోనే మిశ్రా అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మిశ్రా స్టూపిడ్ మెన్ అంటూ ఆమె ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ సొంత బావమరిది సురేంద్రకుమార్ బన్సాల్ నకిలీ బిల్లులు ఇన్వాయిస్ లు సమర్పించి ప్రజాపనుల శాఖ నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నారని ఆరోపణలువచ్చాయి. అంతేకాకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సురేంద్రకుమార్ షుగర్ లెవల్స్ పెరగడంతో గుర్గావ్ ఆసుపత్రిలో మరణించారు.