కపిల్ మిశ్రాపై అసెంబ్లీలోనే ఆప్ ఎమ్మెల్యేల దాడి
ఆప్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలోనే బుదవారం నాడు దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకుగాను మార్షల్స్ కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుండి
న్యూఢిల్లీ: ఆప్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలోనే బుదవారం నాడు దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకుగాను మార్షల్స్ కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుండి బయటకు తీసుకెళ్ళారు.
ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని కపిల్ మిశ్రా ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని చెప్పారు.
సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడ ఇవ్వలేదని కపిల్ మిశ్రా ఆరోపించారు. కేజ్రీవాల్ బండారాన్ని బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దాడికి దిగారని ఆయన చెప్పారు.
తనపై దాడిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలను దాడికి ప్రోత్సహించారని కపిల్ మిశ్రా ఆరోపించారు.
జీఎస్టీ పై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ బుదవారం నాడు ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే కపిల్ మిశ్రాకు ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య అసెంబ్లీ జరుగుతుండగా వాగ్వావాదం చోటుచేసుకొంది. మిశ్రాను బయటకు వెళ్ళాలని స్పీకర్ కోరాడు. ఆయన బయటకు వెళ్ళకుండా ఉండడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడికి దిగారు.