కార్గిల్ విజయ్ దివస్: మోడీ, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ నివాళి
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబా, ఎయిర్ మార్షల్ చీఫ్ బీరేందర్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు.
Recommended Video
ద్రాస్లోని స్మారక స్థూపం వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నార్తర్నల్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ నివాళులు అర్పించారు. ద్రాస్లోని స్మారకం వద్ద సాధారణ పౌరులు కూడా నివాళి అర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన దేశం కోసం కన్నుమూసిన మన హీరోలు (సైనికులు)కు సెల్యూట్ అని కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
On #KargilVijayDiwas, a grateful nation pays homage to all those who served the nation during Operation Vijay. Our brave soldiers ensured that India remains protected and gave a befitting answer to those who tried to vitiate the atmosphere of peace.
— Narendra Modi (@narendramodi) July 26, 2018
India will always remember with pride, the outstanding political leadership provided by Atal Ji during Operation Vijay. He led from the front, supported our armed forces and clearly articulated India’s stand at the world stage. #KargilVijayDiwas
— Narendra Modi (@narendramodi) July 26, 2018
ఆపరేషన్ విజయ్ సందర్భంగా దేశం కోసం పోరాడిన వారందరికీ ఈ దేశం నివాళులు అర్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మన దేశంలో ప్రశాంతతను చెడగొట్టేందుకు ప్రయత్నించిన మూకల కుటిల ప్రయత్నానికి మన ధైర్యవంతులైన మన సైనికులు సరైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. వారి సాహసం వల్లే దేశం రక్షించబడిందన్నారు.
कारगिल के शहीदों को शत शत नमन.
— Sushma Swaraj (@SushmaSwaraj) July 26, 2018
Salute to courage, valour & sacrifice of our martyrs & heroes.#KargilVijayDiwas
ఆపరేషన్ విజయ్ సమయంలో అటల్ బిహారీ వాజపేయి రాజకీయంగా అద్భుతంగా నేతృత్వం వహించారని కితాబిచ్చారు. రాజకీయంగా అతను ముందుండి, మన సైన్యానికి మద్దతు పలికారన్నారు.