వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!
బెంగళూరు: ప్రముఖ లాజిస్టిక్, ప్రైవేటు బస్సు ఆపరేటర్ సంస్థ విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ (వీఆర్ఎల్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2000 రూపాయల నోట్లను తీసుకోవద్దంటూ ఓ సర్కులర్ ను జారీ చేసింది. వీఆర్ఎల్ కు సంబంధించినంత వరకూ ఆ సంస్థకు చెందిన లాజిస్టిక్, ప్రైవేటు బస్సు సర్వీసుల్లో 2000 రూపాయల నోట్లు చెల్లవు. త్వరలో ఆ నోట్లు రద్దయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తుండటం వల్లే ఈ సర్కులర్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటక కేంద్రంగా..
కర్ణాటకలోని హుబ్బళ్లి ప్రధాన కేంద్రంగా విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్క లాజిస్టిక్, ప్రైవేటు బస్సుల రవాణాలోనే కాకుండా పలు రంగాల్లో ఆ సంస్థ వేళ్లూనుకుంది. కర్ణాటకలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వీఆర్ఎల్ సంస్థ యాజమాన్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది. సరుకుల రవాణా, ప్రైవేటు బస్సులు వందల సంఖ్యలో ఉన్నాయి ఆ సంస్థకు. అలాంటి సంస్థ యాజమాన్యమే 2000 రూపాయలను తీసుకోకవడం చర్చనీయాంశమైంది.
Tollywood: నిర్భయ తల్లితో పూనమ్ కౌర్: ఓ చిన్న ట్రీట్: భుజంపై చేతులు వేసి, ఆప్యాయంగా..!
ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ గానీ..
ఈ
ఏడాది
చివరిలో
గానీ
లేదా
వచ్చే
ఆర్థిక
సంవత్సరం
ఆరంభం
నుంచి
గానీ
భారతీయ
రిజర్వు
బ్యాంకు
2000
రూపాయల
నోట్ల
చలామణిని
రద్దు
చేసే
అవకాశం
ఉందని
వీఆర్ఎల్
సంస్థ
యాజమాన్యం
నిశ్చితాభిప్రాయానికి
వచ్చిందని
అంటున్నారు.
ఈ
కారణం
వల్లే
ఆ
పెద్ద
నోట్లను
తీసుకోవద్దంటూ
సర్కులర్
ను
జారీ
చేసిందని
చెబుతున్నారు.
పెద్ద నోట్లు ఉంటే.. బ్యాంకుల్లో జమ చేయాల్సిందే..
పెద్ద నోట్లను తీసుకోకపోవడంతో పాటు.. ఇప్పటికే 2000 రూపాయల నోట్లు ఉంటే.. వాటిని వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని ఆదేశించింది. దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాలంటూ సర్కులర్ లో ఆదేశించింది. వీఆర్ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ సంకేశ్వర్ పేరు మీద ఈ సర్కులర్ జారీ అయింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సిబ్బందిపై సంస్థాగతమైన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
నిజంగా రద్దు చేస్తారా?
2000
రూపాయల
నోట్లు
భవిష్యత్తులో
కనిపించవనే
అనుమానాలు
చాలాకాలం
నుంచే
వినిపిస్తూ
వస్తున్నాయి.
2000
రూపాయల
నోట్ల
వల్ల
నల్ల
డబ్బు
భారీగా
పేరుకుని
పోతోందని,
బ్లాక్
మనీని
దాచుకోవడానికి
ఈ
నోట్లు
అక్రమార్కులకు
మరింత
వెసలుబాటును
కల్పించినట్టయిందనే
అభిప్రాయాలు,
వాదనలు
ఉన్నాయి.
దీనికితోడు-
కొంతకాలంగా
ఏటీఎంలల్లో
ఈ
నోట్లు
రావట్లేదు.
దాని
స్థానంలో
500
రూపాయల
నోట్ల
లావాదేవీలు
ఇదివరకటి
కంటే
కూడా
భారీగా
పెరిగాయి.